యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..

by Disha Web Desk 20 |
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..
X

దిశ, మద్దూరు : దూల్మిట్ట మండల కేంద్రంలోని వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది ఎలాంటి అనుమతులు లేకుండా పట్టపగలే నిర్భయంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ, పోలీసుల నిఘా కొరవడి టన్నుల కొద్ది ఇసుక అక్రమంగా తరలిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల అండదండలతోనే యాదేచ్చగా ఇసుక అక్రమరవాణా జరుగుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.

మండల తహశీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న వాగులో నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. దాదాపు వాగులో నుంచి 200 నుంచి 300 ట్రాక్టర్ టిప్పుల ఇసుక అక్రమంగా రవాణా చేసిన రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇంత వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ విషయం పై తహశీల్దార్ గోపాల్ ను వివరణ కోరగా ఇసుక తరలింపుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.



Next Story

Most Viewed