Husnabad బస్టాండ్‌లో బాంబుల కలకలం

by Disha Web Desk 12 |
Husnabad బస్టాండ్‌లో బాంబుల కలకలం
X

దిశ, హుస్నాబాద్: నిత్యం ప్రయాణికులతో, కాలేజీ, స్కూలుకు వెళ్లే పిల్లలతో రద్దీగా ఉండే హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో ఉదయం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బస్టాండ్‌లో ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. తీరా చూస్తే నాటు బాంబులు. వెంటనే ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏంజెల్ పోలీస్ శాఖ వారికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఏసీపీ వాసాల సతీష్ , సీఐ, ఎస్సై సంఘటన స్థలానికి చేరుకున్నారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఐదు నాటు బాంబులను స్వాధీన పరుచుకున్నారు. ఈ బాంబులను ఇక్కడ ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా బస్టాండ్ ఆవరణలో ఉన్న పార్కింగ్ ప్లేస్‌లో సీసీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. పూర్తి విచారణ చేపట్టి సమాచారం ఇవ్వనున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.



Next Story

Most Viewed