- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం
దిశ, దుబ్బాక: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన ఆస చిన్న ముత్యం కుమారుడు ఆస సాగర్ (22) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం అతడు తన స్వగ్రామం దుబ్బాక వచ్చాడు. అయితే, తన స్నేహితుడు లోకేష్ను కలిసేందుకు మరో మిత్రుడు దినేష్ను వెంటబెట్టుకుని మంగళవారం రాత్రి తన సొంత బైక్పై మాచాపూర్ గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మార్గమధ్యలో బైక్ బల్వంతాపూర్ గ్రామ శివార్లలోకి రాగానే మూలమలుపు వద్ద బైకు అదుపుతప్పి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సాగర్ అక్కడికక్కడే మృతిచెందగా, దినేష్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి తండ్రి చిన్న ముత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపడుతున్నారు.