కరెంటు కోసం రైతుల రాస్తారోకో..

by Taduka Kalyani |

వ్యవసాయానికి 18 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం రెండు గంటల విద్యుత్ కూడా సరఫరా చేయడం లేదంటూ ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించారు.

కరెంటు కోసం రైతుల రాస్తారోకో..
X

దిశ, అక్బర్ పేట భూంపల్లి: వ్యవసాయానికి 18 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం రెండు గంటల విద్యుత్ కూడా సరఫరా చేయడం లేదంటూ ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించారు. ఎల్ నినో ప్రభావంతో బోర్లు అడుగంటి పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటన అక్బర్ పేట భూంపల్లి మండలం కాజీపూర్ లో గురువారం చోటు చేసుకుంది. ఇప్పటికే వర్షాలు లేక పంటల సాగుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బోర్ల ద్వారా నీళ్లు పరిద్దామనుకుంటే అధికారులు కరెంటును సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇకనైనా 18 గంటల త్రీఫేస్ కరెంట్ ను నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

Next Story