ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..

by Disha Web Desk 20 |
ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..
X

దిశ, నర్సాపూర్ : ఏబీవీపీ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలో శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర్ సంయుక్త కార్యదర్శి అక్షయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వారి అవసరాలకు ప్రైవేటు యూనివర్సిటీలకు పర్మిషన్ లేని కాలేజీలలో అడ్మిషన్లు తీసుకొని విద్యార్థుల జీవితాలు రోడ్డుపాలు అయ్యే యత్నం చేస్తున్నారని ఆరోపించారు.

వీటికి వ్యతిరేకంగా ఐఆర్ బోర్డు ముందు నిరసన కార్యక్రమం చేపడితే ఏబీవీపీ రాష్ట్రకార్యదర్శి ఝాన్సీ ఉమానగర్ పోలీస్ స్టేషన్ కి తరలించి కెమెరాలు లేని రూమ్ లో బంధించి లేడీ కానిస్టేబుల్స్ తో తులసి, సరిత కడుపులో తన్నారన్నారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుల పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాంమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ జాయింట్ సెక్రెటరీ అక్షయ్ గౌడ్, కార్యకర్తలు కార్తీక్, అజయ్, గణేష్ తదిపరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed