విద్యుత్ షాక్ తో డ్రైవర్ మృతి

by Disha Web Desk 1 |
విద్యుత్ షాక్ తో డ్రైవర్ మృతి
X

దిశ, చేగుంట: విద్యుదాఘాతంతో ఓ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నర్సంపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఇందు కోసం కంకరను రామాయంపేట క్రషర్ల నుంచి తీసుకొస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.

రామాయంపేట పట్టణానికి చెందిన టంకరి రవి (32) అనే యువకుడు డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తూ కంకర తీసుకొచ్చాడు. నర్సంపల్లిలో కంకరను అన్ లోడ్ చేస్తున్న క్రమంలో వాహనం పైన ఉన్న విద్యుత్ వైర్లకు తగలడంతో డ్రైవర్ రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed