రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి : జిల్లా ఎస్పీ రమణ కుమార్

by Disha Web Desk 1 |
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి : జిల్లా ఎస్పీ రమణ కుమార్
X

దిశ, సంగారెడ్డి : రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా ఎస్పీ రమణ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సంగారెడ్డి జిల్లా పోలీసుల అధ్వర్యంలో పోలీస్ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, పట్టణ యువత రక్తదానం చేశారు.

అనంతరం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ.. సురక్షా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మరియు సంగారెడ్డి పట్టణ యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారని తెలిపారు. 52 యూనిట్ల బ్లడ్ ను సేకరించామని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని, రక్తదానం ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను రక్షించేందకు సాధ్యం అవుతుందని తెలిపారు.

కుల, మత భేదం లేని గ్రూపులు మాత్రమే కలిగి ఉన్న రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, అందుకే రక్తానికి అంత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు సబ్ డివిజన్లలో మొత్తం 291 యూనిట్ల రక్తాన్ని సేకరించామని తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరపున అభినందనలు తెలియజేస్తూ సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ టి.ఉషావిశ్వనాథ్, సంగారెడ్డి డీఎస్పీ బి.రవీంద్రారెడ్డి, డా.జ్యోతి, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ శివలింగం, డీ.సీ.ఆర్.బీ ఇన్స్పెక్టర్ రమేష్, యస్.బీ ఎస్సై యాదవరెడ్డి, ఆర్ఐలు కృష్ణ, డానియల్, రామారావ్, పోలీస్ సంఘం అధ్యక్షుడు దుర్గారెడ్డి, కోశాధికారి ఆసిఫ్, జిల్లా ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story