ధరణి పోర్టల్ తక్షణమే రద్దు చేయాలి: పట్లోళ్ల సంజీవరెడ్డి డిమాండ్

by Disha Web Desk 19 |
ధరణి పోర్టల్ తక్షణమే రద్దు చేయాలి: పట్లోళ్ల సంజీవరెడ్డి డిమాండ్
X

దిశ, నారాయణఖేడ్: రుణమాఫీ కావాలి, ధరణి పోర్టల్ రద్దు చేయాలని పీసీసీ సభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి మేరకు పిలుపు మేరకు నారాయణఖేడ్ ఆర్డీవోకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ సభలో ఆ గ్రామాల భూమి వివాదాలను వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు. అసైన్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాదారులకు హక్కు కల్పించాలన్నారు. ఆ విధంగా చట్ట సవరణ చేయాలి అన్నారు. ప్రతి ఏటా రెండు పంట కాలాలకు భూములు కౌలు చేసుకునే రైతులకు.. ఆ భూములపై హక్కు కలిగే విధంగా గ్రామ స్థాయిలో కౌలు రైతులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలు వారికి అందే విధంగా వ్యవస్థను తీసుకురావాలని డిమాండ్ చేశారు. శాసనసభలో వెంటనే భూమి టైటిల్ గ్యారెంటీ చట్టం తేవాలి అన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలి చేయాలని డిమాండ్ చేశారు.

READ MORE

'చదువుతో పాటు సాంస్కృతిక రంగంలో పాల్గొనాలి'


Next Story

Most Viewed