కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

by Disha Web Desk 1 |
కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు
X

దిశ, కొమురవెల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం అనూహ్యంగా భక్తుల తాకిడి పెరిగింది. ఆలయానికి చేరుకున్న స్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో వెళ్లి దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కుల రూపంలో కేషకాండన, అభిషేకం, నిత్య కల్యాణం, ఘంగారేగు చెట్టుకు ముడుపులు, తిరుగుడు కోడె, పట్నాలు, బోనాలు, అర్చనలు తదితర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపై ఉన్న రేణుక ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ గిస భిక్షపతి, ధర్మకర్తలు, ఈవో బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు,ఒగ్గుపూజరులు, ఆలయ సిబ్బంది భక్తులకు సేవలందించారు.


Next Story

Most Viewed