- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిర్ర గోనె టోర్నమెంట్ ప్రారంభం : ఎమ్మెల్యే
by Taduka Kalyani |
గ్రామీణ ప్రాంతాల్లో అంతరించి పోయిన ఆటలను నేటి తరానికి అందించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో అంతరించి పోయిన ఆటలను నేటి తరానికి అందించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట లో చిర్ర గొనె టోర్నమెంట్ ను ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో నాడు వాలీబాల్, చిర్ర గొనె, కోకో, లాంటి ఆటలు ఎన్నో ఆడేవాళ్లమని, శారీరకంగా, ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉండేవన్నారు. నేటి తరం అన్ని ఆటలు ఫోన్ లోనే ఆన్ లైన్ లోనే ఆడుతున్నారని దాని వలన చిన్నప్పటి నుంచే వ్యాధులకు గురవుతున్నారని చెప్పారు. అలాంటి అంతరించిపోయిన చిర్ర గొనె ఆటను మళ్ళీ గుర్తు చేయడం నేటి తరానికి తెలియ జేయడం సంతోషంగా ఉందని ఈ టోర్నమెంట్ ను నిర్వహించిన నిర్వహాకులకు అభినందనలు తెలిపారు.
Next Story






