సిద్ధిపేట జిల్లాలో దారుణ హత్య.. భూ తగాదాతో అన్న చేతిలో తమ్ముడు హతం

by Disha Web Desk 1 |
సిద్ధిపేట జిల్లాలో దారుణ హత్య.. భూ తగాదాతో అన్న చేతిలో తమ్ముడు హతం
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్ధిపేట జిల్లా కొహెడ మండలం వింజపల్లిలో దారుణం చోటుచేసకుంది. భూ తగాదాతో అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం దారణ హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అన్నదమ్ములు. అయితే, కొన్నాళ్ల నుంచి ఇద్దరి మధ్య భూమి వ్యవహారంలో వాగ్వాదం కొనసాగుతోంది. ఇవాళ మరోసారి భూమి హద్దు విషయంలో అన్నదమ్ములు పరస్పరం దాడికి దిగారు. ఈ క్రమంలోనే అన్న తిరుపతి రెడ్డి విచక్షణ కోల్పోయి తమ్ముడు శ్రీనివాస్ రెడ్డిపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.



Next Story