- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి : ఎమ్మెల్యే రఘునందన్ రావు
దిశ, దుబ్బాక : దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో బుధవారం ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలిని ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం వంద పడకల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అయన మాట్లాడుతూ.. దుబ్బాక ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పేద ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే తెలిపారు. కనిపించని దేవుడి కన్నా.. కనిపించే దేవుడు వైద్య అధికారులు అని అన్నారు. అనంతరం ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్, తహసీల్దార్ ఎండీ సలీం మియా, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత, ఎంపీపీ కొత్త పుష్పలత, జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ దేవుని లలిత, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.