పేకాట స్థావరం పై దాడి.. ఐదుగురి అరెస్ట్

by Disha Web Desk 1 |
పేకాట స్థావరం పై దాడి.. ఐదుగురి అరెస్ట్
X

దిశ, తూప్రాన్: పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేసి ఐదుగురి అరెస్ట్ చేసిన ఘటన తూప్రాన్ మండల పరిధిలోని కరీంగుడ శివారులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంగూడ శివారులో 5 గంటల సమయంలో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్.ఐ సురేష్ కుమార్ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ.21,840లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ పట్టణ పరిధి లో పేకాట మరియు గంజాయి అమ్మకాలకు పాల్పడిన వ్యక్తులను పట్టుకొని చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed