చెరువులో పడి మతిస్థిమితం లేని మహిళ మృతి

by Disha Web Desk 1 |
చెరువులో పడి మతిస్థిమితం లేని మహిళ మృతి
X

దిశ, దౌల్తాబాద్: మతిస్థిమితం కోల్పోయిన మహిళా చెరువులో పడి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం., మెదక్ జిల్లా రామాయం పేట్ మండలం రాయిలాపూర్ కు చెందిన చాకలి లక్ష్మి(40) గత ఐదు రోజుల క్రితం తల్లి గారిల్లైన దొమ్మాటకు వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం చెరువులో పడి మృతి చెందింది. మృతురాలి భర్త బాలరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed