భూ తగాదాలతో తలనరికి.. అనంతరం ఊరేగింపు

by Disha Web Desk 1 |
భూ తగాదాలతో తలనరికి.. అనంతరం ఊరేగింపు
X

అంతటితో ఆగకుండా ఫేస్ బుక్ లోనూ అప్లోడ్

దిశ, ఝరాసంగం: భూ వివాదాలతో సొంత పెద్దనాన్నను తల, ముండెం వేరు చేసి ఊరేగింపు చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో పెను సంచలనంగా మారింది. స్థానిక సీఐ నోముల వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం ఝరాసంగం మండల పరిధిలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన బండమీది చంద్రయ్య (60)కు తమ్ముడి కుమారుడు రాకేష్ పాత కక్షలు ఉన్నాయి. భూ తగాదాలను మనసులో పెట్టుకొని వరుసకు పెదనాన్న అయినా చంద్రన్నను హత్య చేసి తల, మొండెం వేరు చేసినట్లు ఆయన తెలిపారు. తలను 3 కి.మీ. మేర తీసుకెళ్లి ఝరాసంగం పెట్రోల్ పంపు వద్ద పక్కన వేయడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తలను తీసుకొని బర్దిపూర్ గ్రామంలో తిరగడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అంతటితో ఆగకుండా దుశ్చర్యను నిందితుడు రాకేష్ ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటేశం తెలిపారు.



Next Story