- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, జగదేవపూర్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలని ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్ అన్నారు. సోమవారం జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడపలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువకులకు 2కే రన్ నిర్వహించారు. ఈ రన్ లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలో ప్రథమ బహుమతి దూల్మిట్ట వినయ్ కి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి లక్ష్మారెడ్డికి రూ. 2,500 కిరణ్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల లక్ష్మి ఐలయ్య, ఉప సర్పంచ్ లావణ్య మల్లేశం, గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలకిషన్, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు శ్రీశైలం ఉన్నారు.
Next Story






