108 అంబులెన్స్ లో ప్రసవం.. తల్లీ, బిడ్డ క్షేమం

by Disha Web Desk 1 |
108 అంబులెన్స్ లో ప్రసవం.. తల్లీ, బిడ్డ క్షేమం
X

దిశ, చిన్నశంకరంపేట(నార్సింగి) : పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళ 108 అంబులెన్స్ లో ప్రసవించిన ఘటన నార్సింగి మండలం సంకాపూర్ తాండ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రమానికి చెందింన లంబాడి సుశీలకు పురిటి నొప్పులు రావడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం అందజేశారు. సమాచారం తెలుసుకున్న దౌల్తాబాద్ మండలంలోని 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని నార్మల్ డెలివరీ చేయగా, పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీ, బిడ్డలను మెదక్ ప్రభుత్వాసుపత్రిలో అడ్మిట్ చేయగా వైద్యులు పరీక్షించి ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. అత్యవసర సమయంలో ఆదుకున్న ‌108 అంబులెన్స్ సిబ్బంది అశోక్, నరసింహులు ను కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా వైద్యాధికారులు ప్రత్యేకంగా అభినందించారు


Next Story