కాంగ్రెస్‌లో షర్మిలకు ఇచ్చే బాధ్యత ఇదే.. మాణిక్ ఠాకూర్ క్లారిటీ

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌లో షర్మిలకు ఇచ్చే బాధ్యత ఇదే.. మాణిక్ ఠాకూర్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని మోడీ సర్కార్‌, రాష్ట్రంలోని జగన్‌ సర్కార్‌లు నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశాయని ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్ ఠాకూర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌లో ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు 25 ఎంపీ స్థానాలు వస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలను సాకారం చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను పట్టి పీడిస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం అని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో అందరూ ఆనందంగా జీవిస్తారని భరోసా ఇచ్చారు.



Next Story

Most Viewed