రంగంలోకి మందకృష్ణ మాదిగ.. దళిత ఓట్లే టార్గెట్‌గా BJP మరో బిగ్ స్కెచ్

by Disha Web Desk 19 |
రంగంలోకి మందకృష్ణ మాదిగ.. దళిత ఓట్లే టార్గెట్‌గా BJP మరో బిగ్ స్కెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రచారానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను బీజేపీ వినియోగించుకోనుంది. దళితుల ఓట్ల కోసం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆయనతో సభలు నిర్వహించాలని భావిస్తోంది. అందులో భాగంగా ఆయనకు ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్‌ను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 నుంచి మూడ్రోజుల పాటు పలు జిల్లాల్లో సభలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మందకృష్ణ మాదిగ పర్యటనలు కొనసాగనున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాతో పాటు వరంగల్ జిల్లాల్లో సభలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసుకుంది.

కాగా ఈ మూడ్రోజుల్లో ఏదో ఒకరోజు నల్లగొండ కానీ మెదక్ జిల్లాలో కానీ సభ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. దళిత ఓట్ల కోసం బీజేపీ బిగ్ స్కెచ్ వేసుకున్న విషయం తెలిసిందే. 19 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలుండగా జనరల్‌లో మరో రెండు స్థానాలను కేటాయించి దళితులకు పెద్ద పీట వేశామని ప్రచారం చేసుకుంటోంది. అంతేకాకుండా మాదిగ విశ్వరూప మహాసభలో మోడీ వర్గీకరణ విషయంలో అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారి ఓట్లన్నీ బీజేపీ వైపు పడేలా ప్లాన్ చేస్తున్నారు. వారి ఓట్లను గంపగుత్తగా బీజేపీ వైపు మళ్లించేలా మందకృష్ణ సేవలను పార్టీ వినియోగించుకోవాలని భావిస్తోంది.


Next Story

Most Viewed