మహబూబ్‌నగర్‌ అవంతి హోటల్ వద్ద లారీ బీభత్సం

by Disha Web Desk 2 |
మహబూబ్‌నగర్‌ అవంతి హోటల్ వద్ద లారీ బీభత్సం
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని అవంతి హోటల్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చి ఓ బైకును, ప్రతిభ కళాశాల బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కళాశాల బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు మహబూబ్‌నగర్‌కు చెందిన సత్యనారాయణ(60)గా గుర్తించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాద సమయంలో బస్సులో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed