- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్టు్ తప్పదని అన్నారు. ఢిల్లీలో ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. పలు కీలక అంశాలపై ముచ్చటించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విషయం ఏఐసీసీ పరిధిలో ఉందని సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. డీసీసీల అంశంపై సమావేశంపై ఇవాళ మధ్యాహ్నం రాహుల్ గాంధీతో మీటింగ్ ఉంటుందని, ఈ సమావేశానికి ఏఐసీసీ కొత్తగా ఎంపిక చేసిన 22 మంది అబ్జర్వర్లు హాజరవుతారని చెప్పారు. అక్టోబర్ 4వ తేదీన 22 మంది అబ్జర్వర్లు తెలంగాణలో పర్యటిస్తారని వెల్లడించారు.






