బైక్ ను దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు

by Nallavelli.Anjaneyulu |

పల్సర్ బైక్ ను గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి దగ్ధం చెసిన ఘటన గురువారం రాత్రి లింగాల మండలం కేంద్రంలో చోటు చేసుకుంది.

బైక్ ను  దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు
X

దిశ, లింగాల : పల్సర్ బైక్ ను గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి దగ్ధం చెసిన ఘటన గురువారం రాత్రి లింగాల మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర గౌడ్ వివరాల ప్రకారం .. లింగాల మండల కేంద్రానికి చెందిన గువ్వని భీమయ్య రోజు మాదిరి గానే యధావిధిగా ఇంటి ఎదుట తన బైక్ పార్క్ చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన బైక్ కు నిప్పు పెట్టి దగ్ధం చేసినట్లు బాధితుడు ఆరోపించారు. శబ్దం రావడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసే సరికి మంటలతో బైక్ సాగ భాగం దగ్ధమైందని బాధితుడు ఆరోపించారు. బాధితుడు గువ్వని భీమయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story