భారి చోరి దొంగలు సీసీ కంట పడ్డారు.. సెర్చింగ్ లో పోలీసులు

by Disha Web Desk 20 |
భారి చోరి దొంగలు సీసీ కంట పడ్డారు.. సెర్చింగ్ లో పోలీసులు
X

దిశ, మక్తల్ : మక్తల్ పట్టణంలోని సాయినగర్ కాలనీలో జగిన భారీ చోరికి గల చిత్రాలను ఆ ప్రాంతములో ఉన్న ప్రైవేటు పాఠశాల దగ్గర ఉన్న సీసీటీవీ పుటేజి పట్టేసింది. పల్సర్ ఎర్ర బైకు పై ముగ్గురు యువకులు ఎనిమిది గంటల ప్రాంతంలో సంఘటన జరిగిన ఏరియా నుండి వస్తున దృశ్యం సీసీ పుటేజీలో రికార్డు అయిందని దానికి, పోలీసులు వేట ప్రారంభించారని విశ్వసనీయ సమాచారం. మంగళవారం పంద్రాగస్టు అందరు బిజీ ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు చోరి పనిని చక్కపెట్టారు.

తమను ఎవరూ గమనించలేదు అనుకున్నారు. కాని వారు పారిపోతున్న గుట్టును సీసీ కెమెరా పట్టేసింది. మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సాయినగర్ కాలనిలో కట్టావీరశేఖర్ శేట్టి ఇంటి తాళాలు విరగోట్టి 14తులాల బంగారు నగలు నాల్గు లక్షల నగదును ఎత్తు కేళ్ళిన విషయం పాఠకులకు విదితమే. రికార్డైన సీసీ పుటేజీలను మక్తల్ పోలీసులు సేకరించారు. దాని ఆధారంగా పట్టు కునేందుకు వేట ప్రారంభించినట్లు సమాచారం.



Next Story

Most Viewed