రూ. 6కోట్ల 40 ల‌క్ష‌ల‌తో నిర్మిస్తున్న బ్రిడ్జీ ప‌నులు ప‌రిశీలించిన మంత్రి

by Ratna Kumari |

మండల కేంద్రంలోని కల్వాల్ నుంచి సీపూర్ గ్రామం మధ్యలో రూ. 6కోట్ల 40లక్షల వ్యయం తో నిర్మిస్తున్న రోడ్డు కమ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు.

రూ. 6కోట్ల 40 ల‌క్ష‌ల‌తో నిర్మిస్తున్న బ్రిడ్జీ ప‌నులు ప‌రిశీలించిన మంత్రి
X

దిశ‌, న‌ర్వ : మండల కేంద్రంలోని కల్వాల్ నుంచి సీపూర్ గ్రామం మధ్యలో రూ. 6కోట్ల 40లక్షల వ్యయం తో నిర్మిస్తున్న రోడ్డు కమ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. గత 10రోజుల కిందట వంతెనకు మంత్రి శంకుస్థాపన చేశారు. బ్రిడ్జ్ నిర్మాణం లోని నాణ్యత పనులను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. మంత్రి ఇంజినీర్ లకు తగు సూచనలు చేశారు. త్వరలో వర్షాకాలం లోపు వంతెన నిర్మాణం పూర్తయి కావాలని తెలియజేశారు. బ్రిడ్జి పనులు అతి శరవేగంగా జరపాలని ఇంజనీర్లకు తెలియజేశారు. అతి తొందరలో రెండు గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణం సాగించవచ్చని పనులు వేగవంతం చేయాలని అన్నారు.

Next Story