ఆటో ని ఢీ కొట్టిన కారు

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఎర్రవల్లి : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కొందండపురం స్టేజి సమీపంలో ఆటోని వెనుక నుండి కారు ఢీ కొట్టి ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల

ఆటో ని ఢీ కొట్టిన కారు
X

దిశ, ఎర్రవల్లి : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కొందండపురం స్టేజి సమీపంలో ఆటోని వెనుక నుండి కారు ఢీ కొట్టి ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోదండపురం గ్రామానికి చెందిన కుమ్మరి సూరి (35) భార్య వేముల స్టేజి దగ్గర ఆటోమొబైల్ క్యాంటీన్ టిఫిన్ అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.బుధవారం రోజు టిఫిన్ పూర్తి చేసుకొని కోదండపురం గ్రామానికి వస్తుండగా కర్నూల్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న షిఫ్ట్ కార్ వెనుక నుండి ఆటోని ఢీ కొట్టడంతో ఆటో పల్టీలు కొట్టింది భార్య భర్తలకు బలమైన గాయాలు కావడంతో హుటాహుటిన హైవే అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story