క్రీడలు పట్టుదలను పెంచుతాయి: ఎస్పీ నరసింహ

by Disha Web Desk 11 |
క్రీడలు పట్టుదలను పెంచుతాయి: ఎస్పీ నరసింహ
X

దిశ, మహబూబ్ నగర్: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు విజయం సాధించాలనే పట్టుదలనూ పెంచుతాయని జిల్లా ఎస్పీ కె. నరసింహ అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం ఆయన పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ -2023 ని ప్రారంభిస్తూ ప్రసంగించారు. ఉద్యోగికి ఆరోగ్యకరమైన పని వాతావరణానికి, మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.

క్రీడల వలన ఆరోగ్యమే కాకుండా పనిలో ఉత్పాదకతను కూడా మెరుగు పరుస్తుందని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో అడిషపల్ ఎస్పీ రాములు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీలు మహేష్, రమణారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ, రిజర్వు సీఐ, ఎస్ఐ, ఆర్ఎస్ఐ లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed