- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > దిశ కథనానికి స్పందన.. రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి..!
దిశ కథనానికి స్పందన.. రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి..!
మండలంలోని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఆందోళన చెందవద్దని మండల వ్యవసాయ అధికారి మణిచందర్ అన్నారు.

X
దిశ, పాన్ గల్ : మండలంలోని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఆందోళన చెందవద్దని మండల వ్యవసాయ అధికారి మణిచందర్ అన్నారు. మంగళవారం దిశ దినపత్రికలో వచ్చిన క్యూ లైన్ లో నిలబడి రొట్టెలు తిని వార్తకు స్పందించారు. రైతు వేదిక వద్ద యూరియా కోసం వచ్చిన రైతులకు రైతు వేదిక భవనంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కావాల్సిన మండలానికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. రైతులు యూరియా కోసం వచ్చి ఇబ్బందులకు గురి కావద్దన్నారు. వ్యవసాయ పనులను వదులుకొని యూరియా కోసం పడి కాపులు కాయాల్సిన అవసరం లేదన్నారు. మండలానికి సరిపడినంత యూరియా రోజువారీగా యూరియాను నిరంతరం రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు.
Next Story






