దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ‌ చేయూత

by Ratna Kumari |

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామపంచాయతీ ఆమ్లెట్ గ్రామం మల్లాపూర్ చెంచు పెంటకు టైగర్ ట్రాకర్ చిగుర్ల చిన్నబ్బాయన్న శుక్రవారం సాయంత్రం

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ‌ చేయూత
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామపంచాయతీ ఆమ్లెట్ గ్రామం మల్లాపూర్ చెంచు పెంటకు టైగర్ ట్రాకర్ చిగుర్ల చిన్నబ్బాయన్న శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా మరణించిన విషయం దిశ కథనంతో వెలుగులోకి వ‌చ్చింది. అందుకు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. కుటుంబానికి ఆదివారం స్థానిక శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు 50 కేజీల బియ్యం, రూ. 5వేల నగదు మల్లాపూర్ పెంటకు వెళ్లి అందజేశారు. మృతిని భార్య బాల గురువమ్మ ముగ్గురు పిల్లలు వారికి ప్రభుత్వ హాస్టల్లో వసతి కల్పించి బాల గురువమ్మకు ఉపాధి చూపిస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ‌ హామీ ఇచ్చారు.

Next Story