ఫ్లెక్సీలలో.. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఫోటోలు గాయబ్

by Disha Web Desk 9 |
ఫ్లెక్సీలలో.. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఫోటోలు గాయబ్
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వస్తున్న సందర్భంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ రాములు, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫోటోలు లేకపోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సారథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు.. పార్టీ జెండాలతో ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి మందా జగన్నాథం, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తదితర నేతల ఫోటోలు ఫ్లెక్సీలలో వేశారు. కానీ నియోజకవర్గ ఎంపీ రాములు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, చీఫ్ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు వెలిసాయి. ఈ ఫ్లెక్సీలను చూసిన జనం పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed