ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బీరం..

by Disha Web Desk 11 |
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బీరం..
X

దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని రైతులు పండించిన ప్రతి గింజ కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంబంధిత అధికారులు తగిన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed