- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి జూపల్లి
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

దిశ, పెద్దకొత్తపల్లి: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి, చెన్నపురావుపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తొలి విడతలో రూ.22,500 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రెండవ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, నియోజకవర్గానికి 2 వేల ఇండ్ల చొప్పున మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. కులం, మతం, వర్గం, రాజకీయ అనుబంధం చూడకుండా అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. ఇండ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం దశలవారీగా బిల్లులు చెల్లిస్తూ నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.






