త్రయంబకేశ్వరంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి, ఎమ్మెల్యేలు

by Disha Web Desk 12 |
త్రయంబకేశ్వరంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి, ఎమ్మెల్యేలు
X

దిశ, వనపర్తి : మహారాష్ట్ర నాసిక్‌లో సోమవారం జరిగిన వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వివాహ వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహారాష్ట్రలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరాలయంను సందర్శించి స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Next Story

Most Viewed