- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మేఘానికి రాఖీ కట్టిన మాతృమూర్తి
by Disha Web Desk 11 |
X
దిశ, ఊట్కూర్ : మేఘానికి రాఖీ కట్టి వర్షాలు కురవాలని కోరిన వినూత్న సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని బిజ్వర్ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ రాఖీ పండుగ సందర్భంగా మేఘానికి రాఖీను చూపిస్తూ వర్షాలు కురిపించాలని పత్తి, కంది పంటలను రక్షించాలని ఆమె ప్రార్థించింది. జులై నెలలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. కానీ ఆగస్టు మొదలైనప్పటినుండి సరైన వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా వేసవికాలం మాదిరిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పత్తి, కంది మొక్కలు వాడు మొహం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Next Story