మేఘానికి రాఖీ కట్టిన మాతృమూర్తి

by Disha Web Desk 11 |
మేఘానికి రాఖీ కట్టిన మాతృమూర్తి
X

దిశ, ఊట్కూర్ : మేఘానికి రాఖీ కట్టి వర్షాలు కురవాలని కోరిన వినూత్న సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని బిజ్వర్ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ రాఖీ పండుగ సందర్భంగా మేఘానికి రాఖీను చూపిస్తూ వర్షాలు కురిపించాలని పత్తి, కంది పంటలను రక్షించాలని ఆమె ప్రార్థించింది. జులై నెలలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. కానీ ఆగస్టు మొదలైనప్పటినుండి సరైన వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా వేసవికాలం మాదిరిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పత్తి, కంది మొక్కలు వాడు మొహం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


Next Story

Most Viewed