జోరుగా సాగుతున్న మట్క దందా.. పట్టించుకోని అధికారులు

by Dishanational2 |
జోరుగా సాగుతున్న మట్క దందా.. పట్టించుకోని అధికారులు
X

దిశ ,కృష్ణ : మండల పరిధిలోని పలు గ్రామాల్లో మట్క దందా జోరుగా నడుస్తుంది. రోజు లక్షల్లో ఆట కొనసాగుతున్న దాని సంబంధించిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు . మట్కా వలన ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. సంసారాలు దెబ్బతింటున్నాయి. కృష్ణ మండలంలోని ప్రజలు చెబుతున్నారు.

వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం.. అధికారులకు అన్నీ తెలిసినా కూడా తెలియనట్లుగా నటిస్తున్నారు. ఎందుకంటే ప్రతినెలా వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే జీతం కంటే కరెక్టుగా మట్కా వాళ్ళు ఇచ్చే మామూలు ముడుతున్నాయని ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తక్షణమే మట్కా రాసే వారిని అరెస్టు చేసి ఆటను బందు చేసి కఠినమైన చర్యలు తీసుకోని కృష్ణ మండల ప్రజానీకాన్ని కాపాడవలసిందిగా ప్రజలు వేడుకుంటున్నారు.

Next Story