పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్ పాలన: ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

by Disha Web Desk 1 |
పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్ పాలన: ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
X

దిశ, మహబూబ్ నగర్: వందల ఏకరాలున్న భూస్వామికి రైతు బంధు ఇస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు దళితబంధు పేర కార్లు ఇస్తున్నారని పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్ పాలన కొనసాగుతోందని బీజేపీ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటేల రాజేందర్ అన్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో బడ్జేట్ పై ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం ఎవరికి సహయం చేయాలో, ఎవరికి చేయకూదనే సోయి లేదని ఆయన విమర్శించారు.

కేంద్రం నుంచి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంలకు,15 వ ఫైనాన్స్ కమీషన్ నుంచి స్థానిక సంస్థల నుంచి వెనకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నాలుగు రకాల నిధులు వస్తే, కేంద్రం పన్నులు ఎగ్గొడుతోందని కేసీఆర్ ఆరోపించడం తగదన్నారు. ఏసీడీల పేరుతో వసూలు చేస్తున్న కరెంట్ చార్జీల డిపాజిట్లు తిరిగి రావని, కాళేశ్వరం ప్రాజెక్టు కరెంట్ వాడకపోయినా రూ.3,500 కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సదస్సులో జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, మేధావులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed