రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో యువకుడికి గోల్డ్ మెడల్..

by Disha Web Desk 11 |
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో యువకుడికి గోల్డ్ మెడల్..
X

దిశ, దామరగిద్ద: హన్మకొండ స్టేడియంలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా జావెలిన్ త్రో క్రీడలో 15 మంది క్రీడాకారులు పాల్గొనగా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్ పల్లి గ్రామానికి చెందిన బుడ్డపోళ్ల రవికుమార్ జావెలిన్ 44.5 మీటర్లు త్రో చేసి ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో నిర్వాహకులు అతనికి గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ ఇచ్చారు. రవికుమార్ ను బాపన్ పల్లి గ్రామ ప్రజలు అభినందించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ అడ్వకేట్ రవికుమార్ ను అభినందించి మరెన్నో విజయాలు సొంతం చేసుకుని మంచి పేరు తీసుకురావాలని కోరారు.

Next Story

Most Viewed