పాముకాటుతో రైతు మృతి

by Elthuri vijay kumar |

పంట పొలంలో పని చేస్తున్న రైతు పాముకాటుతో మృతి చెందిన ఘటన మానోపాడు మండలం కొర్విపాడులో బుధవారం చోటుచేసుకుంది.

పాముకాటుతో రైతు మృతి
X

పాముకాటుతో రైతు మృతి

- మానోపాడు మండలం కొర్విపాడులో ఘటన

దిశ, మానోపాడు: పంట పొలంలో పని చేస్తున్న రైతు పాముకాటుతో మృతి చెందిన ఘటన మానోపాడు మండలం కొర్విపాడులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై చంద్రకాంత్ తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన వెంకట్రాంరెడ్డి (77) ఉదయం కాడెద్దులతో సేద్యం చేస్తుండగా పాము కాటేసింది. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని కుమారుడు ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.

Next Story