12న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం

by Ratna Kumari |

దిశ, కందనూల్ : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాగర్‌కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశం ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత

12న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం
X

దిశ, కందనూల్ : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాగర్‌కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశం ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్‌రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి రాష్ట్ర సంఘ అధ్యక్షుడు బి.రవి, ప్రధాన కార్యదర్శి జి.సదానంద గౌడ్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎం.పర్వత రెడ్డి, ఎన్నికల అధికారులు శ్రీనివాసరావు, వై.కరుణాకర్ రెడ్డి హాజరవనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

Next Story