మండ‌లంలో క‌లెక్ట‌ర్ అక‌స్మిక ప‌ర్య‌ట‌న

by Ratna Kumari |

దిశ‌, చిన్నంబావి : మండ‌లంలో క‌లెక్ట‌ర్ ఆద‌ర్శ్ సుర‌భి ఇవాళ ప‌ర్య‌టించారు తొలుత మండలంలోఇన వెలగొండ గ్రామంలోని పాఠ‌శాల‌ను సంద‌ర్శించి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి నూతనంగా

మండ‌లంలో క‌లెక్ట‌ర్ అక‌స్మిక ప‌ర్య‌ట‌న
X

దిశ‌, చిన్నంబావి : మండ‌లంలో క‌లెక్ట‌ర్ ఆద‌ర్శ్ సుర‌భి ఇవాళ ప‌ర్య‌టించారు తొలుత మండలంలోఇన వెలగొండ గ్రామంలోని పాఠ‌శాల‌ను సంద‌ర్శించి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి నూతనంగా మంజూరైన పాఠశాల భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. అనంతరం మండల కేంద్రంలో మార్క్ పెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే మండల పరిషత్ కార్యాలయం, తహశీల్దార్, కార్యాలయాలను పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమం లో క‌లెక్ట‌ర్ వెంట ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో, వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ బగ్గారి నరసింహారెడ్డి, కాంగ్రెస్ మండల యువ నాయకులు కొత్త కళ్యాణ్ రావు, సీఈఓ నాగరాజు, ఎంపీఓ రామస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story