నల్ల బెల్లం, పటిక పట్టివేత..

by Disha Web Desk 11 |
నల్ల బెల్లం, పటిక పట్టివేత..
X

దిశ, అచ్చంపేట: ఓ వ్యక్తి కారులో నల్ల బెల్లం, పటిక తరలిస్తుండగా పట్టుబడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధి డొక్కు తండాలో శనివారం జరిగింది. ఎక్సైజ్ శాఖ ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్సైజ్ శాఖ రూట్ వాచ్ లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా డొక్కు తండాకు చెందిన శేఖర్ కారులో 120 కేజీల నల్లబెల్లం, 50కేజీల పటిక తరలిస్తున్నట్లు గుర్తించారు. కారుతోపాటు పై సరుకులు స్వాధీనం చేసుకొని, నిందితుడు శేఖర్ పై బైండోవర్ కేసు నమోదు చేసి అచ్చంపేట తహసీల్దార్ ఎదుట హాజరు పరచారు. ఈ తనిఖీలలో ఎస్ఐ సతీష్ కుమార్, సిబ్బంది ప్రకాష్, షఫీ, స్వాతిలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed