గొర్రెల మంద పై బైకు ఢీ.. 2 గొర్రెలు మృతి.. కాప‌రికి గాయాలు..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, నాగర్ కర్నూల్ : గొర్రెల మంద ను బైకు ఢీ కొన‌డంతో 2 గొర్రెలు మృతి చెంద‌టంతో పాటు గొర్రెల కాప‌రికీ గాయాలైన ఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా ప‌రిధిలో చోటు

గొర్రెల మంద పై బైకు ఢీ.. 2 గొర్రెలు మృతి.. కాప‌రికి గాయాలు..!
X

దిశ, నాగర్ కర్నూల్ : గొర్రెల మంద ను బైకు ఢీ కొన‌డంతో 2 గొర్రెలు మృతి చెంద‌టంతో పాటు గొర్రెల కాప‌రికీ గాయాలైన ఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. నాగర్ కర్నూల్ జిల్లా వనపట్ల గేటు సమీపంలో గొర్రెల కాపరిని, గొర్రెలను ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి గాయపడి స్పృహ తప్పి పడిపోయాడు. రెండు గొర్రెలు మృతి చెందాయి. అటుగా వెళుతున్న ప్రయాణికులు గమనించి గొర్రెల కాప‌రికి మంచినీళ్లు తాగించి, అంబులెన్స్ కు సమాచారమిచ్చారు. క్షతగాత్రుడు పెద్ద కొత్తపల్లి మండలం లోని వెన్నచర్ల గ్రామానికి చెందిన వ్యక్తి తిక్కన్న గా గుర్తించారు. అత‌డినీ గాయత్రి హాస్పిటల్ కు చికిత్స నిమ్మితం తరలించారు.

Next Story