నాపై దాడికి యత్నం...ఎంపీపీ అశోక్ రెడ్డి

by Disha Web Desk 11 |
నాపై దాడికి యత్నం...ఎంపీపీ అశోక్ రెడ్డి
X

దిశ, అలంపూర్ : వరద బాధితుల ఇళ్ల స్థలాలను ఇవ్వద్దని ఏ రోజు నేను అనలేదని... కావాలని నాపై దుష్ప్రచారం చేస్తూ నా,పై దాడికి ప్రయత్నం చేస్తున్నారని ఎంపీపీ అశోక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిషత్ లో మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు. తాను మద్దూరు గ్రామానికి ఎంపీపీగా మరిచి.. తనపై సర్పంచి వర్గం బాధితులు లేనిపోని ఆరోపణలు చేస్తూ దాడికి యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం కూడా నేను కార్యాలయంలో లేనని తెలుసుకొని రెండు వందల మందికి పైగా సర్పంచ్ తన వర్గాన్ని తీసుకొచ్చి లేనిపోని మాటలు చెప్పి ఎంపీడీవో కి వినతి పత్రం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయంగా తనపై ఎదగలేక ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చారు. గ్రామంలో కలిసికట్టుగా ఏ పనినైనా చేయుటకు నేను సిద్ధంగా ఉన్నానని మరోసారి గుర్తు చేశారు.


Next Story