మంత్రి జూప‌ల్లి ఇంటిని ముట్ట‌డించిన ఆశా కార్య‌క‌ర్త‌లు

by Ratna Kumari |

త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సీఐటీయూ ఆధ్వ‌ర్యంలో కొల్లాపూర్ లో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు క్యాంపు కార్యాల‌యాన్ని ఆశాకార్య‌క‌ర్త‌లు ముట్ట‌డించారు.

మంత్రి జూప‌ల్లి ఇంటిని ముట్ట‌డించిన ఆశా కార్య‌క‌ర్త‌లు
X

దిశ‌, కొల్లాపూర్ : తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కొల్లాపూర్ లో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్నీ ఆశా కార్యకర్తలు ముట్టడించారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కృషి చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ, ఆశా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Next Story