పొయ్యి మంట‌ బారిన ప‌డి వృద్ధురాలు మృతి

by Ratna Kumari |

మండ‌ల ప‌రిధిలోని కాక‌ర్జాల గ్రామంలో ఓ వృద్ధురాలు పొయ్యి మంట బారిన ప‌డి మృతి చెందింది.

పొయ్యి మంట‌ బారిన ప‌డి వృద్ధురాలు మృతి
X

దిశ‌, న‌వాబుపేట : మండ‌ల ప‌రిధిలోని కాక‌ర్జాల గ్రామంలో ఓ వృద్ధురాలు పొయ్యి మంట బారిన ప‌డి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కాక‌ర్జాల గ్రామానికి చెందిన గోవు ప‌ద్మ‌మ్మ(70) సోమ‌వారం ఇంట్లో పొయ్యి పై టీ పెడుతుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు నిప్పు ర‌వ్వ‌లు ఆమె చీర‌పై ప‌డ్డాయి. దీంతో క్ష‌ణాల్లో మంట‌లు ఒళ్లంతా వ్యాపించి తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం మృతి చెందింది. మృతురాలు కుమారుడు గోవు జంగ‌య్య ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై విక్ర‌మ్ తెలిపారు.

Next Story