ద్విచ‌క్ర వాహ‌నాన్ని కారు ఢీ.. వ్య‌క్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఉండ‌వెల్లి : ద్విచ‌క్ర వాహ‌నాన్ని కారు ఢీ కొన‌డంతో ఓ వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న ఉండ‌వెల్లి మండ‌ల

ద్విచ‌క్ర వాహ‌నాన్ని కారు ఢీ.. వ్య‌క్తి మృతి
X

దిశ‌, ఉండ‌వెల్లి : ద్విచ‌క్ర వాహ‌నాన్ని కారు ఢీ కొన‌డంతో ఓ వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న ఉండ‌వెల్లి మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉండవెల్లి గ్రామానికి చెందిన రాజు (36) అనే వ్యక్తి కర్నూల్ పట్టణానికి వెళుతున్నాడు. అయితే 44వ జాతీయ ర‌హ‌దారి పై అతివేగంగా హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వస్తున్న స్కార్పియో కారు రాజు ద్విచ‌క్ర వాహ‌నాన్ని వెనుక నుంచి ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన రాజును కర్నూలు తరలించగా.. మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. రాజు కర్నూల్ సంతోష్ నగర్ లోని లాడ్జి లో సూప‌ర్ వైజ‌ర్ గా ప‌ని చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Next Story