విద్యార్థినిపై ఏడాది నుంచి అత్యాచారం

by Ratna Kumari |

ఓ మైనర్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి సంవత్సర కాలంగా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి గురువారం తెలిపారు.

విద్యార్థినిపై  ఏడాది నుంచి అత్యాచారం
X
దిశ‌, పెబ్బేరు : ఓ మైనర్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి సంవత్సర కాలంగా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి గురువారం తెలిపారు. మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన బాలిక పాఠశాలకు వచ్చి వెళ్లే క్రమంలో అదే గ్రామానికి చెందిన 30 సంవత్సరాల వివాహితుడు మాయమాటలతో లోపర్చుకున్నాడు. గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి వీలు చిక్కినప్పుడల్లా అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ఎస్సై కలిపారు. బాలికపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేసిన‌ట్టు ఎస్సై యుగంధ‌ర్ రెడ్డి తెలిపారు.
Next Story