మైన‌ర్ బాలిక పై అత్యాచారం చేసిన వ్య‌క్తికి 35 ఏళ్లు జైలు శిక్ష

by Ratna Kumari |   (  Updated:2025-11-13 15:13:44  IST  )

దిశ, ఎర్రవల్లి : మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన వ్య‌క్తికి 35 ఏళ్లు జైలు శిక్ష ప‌డింది. ఈ ఘ‌ట‌న కోదండపురం పోలీస్ స్టేషన్

మైన‌ర్ బాలిక పై అత్యాచారం చేసిన వ్య‌క్తికి 35 ఏళ్లు జైలు శిక్ష
X

దిశ, ఎర్రవల్లి : మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన వ్య‌క్తికి 35 ఏళ్లు జైలు శిక్ష ప‌డింది. ఈ ఘ‌ట‌న కోదండపురం పోలీస్ స్టేషన్ ప‌రిధి లో చోటుచేసుకుంది. కోదండపురం ఎస్ఐ మురళి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామానికి చెందిన చాకలి హరిచంద్ర (33) 2012 సంవత్సరంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేసిన కేసులో పోలీసులు పోస్కో కేసు నమోదు చేశారు. స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గద్వాల జడ్జి రవికుమార్ నేరస్థునికి 35 సంవత్సరాలు జైలు శిక్ష, 50వేల రూపాయలు జరినామ విధించారు. అలాగే బాధితురాలుకు రూ.5ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించేలా కోర్టు ఆదేశాల మేర‌కు నేరస్థున్ని రిమాండ్ కు తరలించినట్లు కోదండపురం ఎస్ఐ కె.మురళి తెలిపారు.

Next Story