రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Ratna Kumari |

రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న మండల ప‌రిధిలోని బోయిన‌ప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, మిడ్జిల్ : రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న మండల ప‌రిధిలోని బోయిన‌ప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా ఊరుకొండ మండ‌లం బాల్య లోక్య తండాకు చెందిన దేవ్య నాయ‌క్ (39) బోయిన‌ప‌ల్లి గ్రామానికి ప‌నుల నిమిత్తం వ‌చ్చారు. క‌ల్వ‌కుర్తి-జ‌డ్చ‌ర్ల హైవే రోడ్డు దాటుతుండ‌గా క‌ల్వ‌కుర్తి నుంచి జ‌డ్చ‌ర్ల వెళ్తున్న కారు వేగంగా ఢీ కొట్ట‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story