వాగులో పడి వ్యక్తి మృతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-08 10:42:11  IST  )

దిశ‌, తాడూరు : వాగులో ప‌డి వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న సిర‌స‌వాడ గ్రామ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. తాడూర్ మండ‌ల ప‌రిధిలోని సిర‌స‌వాడ గ్రామానికి చెందిన

వాగులో పడి వ్యక్తి మృతి
X

దిశ‌, తాడూరు : వాగులో ప‌డి వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న సిర‌స‌వాడ గ్రామ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. తాడూర్ మండ‌ల ప‌రిధిలోని సిర‌స‌వాడ గ్రామానికి చెందిన జంగ‌య్య (50) మంగ‌ళ‌వారం రోజు మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో గ్రామానికి అనుస‌రించి ఉన్న దుందుభి వాగ్ లోని చెక్ డ్యామ్ పై న‌డుచుకుంటూ వెళ్లాడు. దీంతో ప్ర‌మాద‌వ‌శాత్తు వాగులో పడడంతో తలకు తీవ్ర గాయమై చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కిందపడ్డ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఈ విషయం మర్నాడు బుధవారం ఉదయం శవం బయటకి తేలడంతో గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందింఇచారు. సంఘటన స్థలాన్ని ఇవాళ ఆర్ఐ సల్మాన్ పరిశీలించి పంచనామా నిర్వహించినట్టు తెలిపారు.

Next Story