అసభ్యంగా ప్రవర్తించిన పంతులు పై కేసు నమోదు

by Disha Web Desk 11 |
అసభ్యంగా ప్రవర్తించిన పంతులు పై కేసు నమోదు
X

దిశ, నాగర్ కర్నూల్ :- నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని 20 ఏండ్ల యువతితో అసభ్యంగా ప్రవర్తించిన అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడిపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగశేఖర్ రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం...రెండు మూడు రోజులుగా యువతి ప్రవర్తనలో వచ్చిన మార్పు పై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ప్రశ్నించగా కీచక ఉపాధ్యాయుడి విషయం చెప్పింది. అభం శుభం తెలియని మానసిక స్థితి సరిగా లేని యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు (60) రిటైర్మెంట్ కు దగ్గర ఉన్న వయసులో ఇదేం బుద్ధి అని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed